స్టార్ యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం

by Disha Web Desk 19 |
స్టార్ యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్, నటీ రష్మీ గౌతమ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియా వేదికగా రష్మీ తెలిపింది. ''ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రాకు మా కుటుంబ సభ్యులమంతా బరువెక్కిన హృదయాలతో చివరిసారిగా వీడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె మా నుండి దూరమైన.. ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు మాతోనే ఉంటాయ్. ఓం శాంతి'' అంటూ తన గ్రాండ్ మదర్‌తో అనుబంధాన్ని రష్మీ గుర్తు చేసుకుంటూ ఇన్స్ స్టా గ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story